ఏలూరు: గుండెపోటుతో వైసీపీ నేత మృతి

గురువారం గుండెపోటుతో వైసీపీ జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి తోటకూర కిషోర్ మృతి చెందారు. ఆయన భౌతిక కాయానికి ఏలూరు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జి మామిళ్ళపల్లి జయప్రకాష్ పూలమాలవేసి నివాళులర్పించారు. కిషోర్ మృతి పార్టీకి తీరని లోటని జయప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. కిషోర్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

సంబంధిత పోస్ట్