వేలేరుపాడులో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందడం పట్ల ఎంపీ పుట్టా మహేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కుక్కునూరు సీఐ రమేష్తో ఫోన్లో మాట్లాడి, అనుమానాలు వ్యక్తం చేస్తూ కొందరు తనకు ఫోన్ చేసిన విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి, కుట్ర కోణంలో జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.