ఏలూరు మండలం వెంకన్న ట్యాంక్ సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ తీగల మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు పనులను శుక్రవారం చేపట్టనున్నట్లు ఈఈ అంబేడ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 7 కాలువల సెంటర్, కొత్తగూడెం, మోటిపల్లి వారి వీధి, మేకల వీధి, తూర్పు వీధి, తదితర ఏరియాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.