పేద ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండలంలోని వరాహపట్నం క్యాంపు కార్యాలయంలో ఆయన వివిధ ప్రాంతాలకు చెందిన 17 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మొత్తం ₹. 7,31,883 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు.