మొగల్తూరు: ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

మొగల్తూరు గ్రామంలో ప్రసిద్ధి చెందిన పెద్ద రామాలయం వీధుల్లో వేంచేసియున్న శ్రీ దత్త సాయి బాబా ఆలయంలో గురువారం ఉదయం ఆలయ నిర్వాహకులు శెట్టి మోహన్ రావు ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొగల్తూరు, రామన్నపాలెం, పులపర్తి వారితోట, పసలదీవి, సేరేపాలెం, కొత్తపాలెం గ్రామాల నుండి బాబా భక్తులు స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. భక్తుల ఆర్థిక సహకారంతో ఆలయ ఆవరణలో భారీ అన్న సంతర్పణ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్