శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాట ఘటనలో అమాయక భక్తులు ప్రాణాలు కోల్పోవడం, పలువురు గాయపడటంపై నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయక తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు తన సానుభూతిని తెలియజేశారు. గాయపడిన భక్తులు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు.