నరసాపురం ఎస్సై జి. వాసు తెలిపిన వివరాల ప్రకారం, తుర్పుతాళ్లు గుత్తుల వారి మెరకలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో ఈనెల 8న దుండగులు సుమారు కిలో బరువుగల వెండి కిరీటం, అభయ హస్తం చోరీ చేశారు. ఆలయ నిర్వాహకుడు గుత్తుల సుబ్బన్న ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేశారు.