నరసాపురంలో ఉద్రిక్తత

నరసాపురం నుంచి సేకరించిన చెత్తను రుస్తుంబాదలోని మండవారి గరువు వద్ద వేయడాన్ని నిరసిస్తూ గురువారం స్థానికులు ఆందోళన చేపట్టారు. నివాసాల మధ్య చెత్త వేయడం వల్ల ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. చెత్త సేకరించే లారీని అడ్డుకొని, జనావాసాలకు దూరంగా తరలించాలని అధికారులను కోరారు. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్