నరసాపురంలో ప్రభుత్వ పాఠశాలల కుక్-కమ్-హెల్పర్ల కోసం బుధవారం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం జరిగింది. ఎంఈఓ-2 జాన్ ప్రభాకర్ కోర్సు డైరెక్టర్గా, ఎంఈఓ-1 పుష్పరాజ్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు రుచికరమైన, పౌష్టికాహారాన్ని అందించడం ప్రభుత్వ లక్ష్యమని, వంటలో పరిశుభ్రత పాటించాలని అధికారులు సూచించారు.