ఆకివీడులో డ్వాక్రా సంఘం యానిమేటర్ సుధా అక్రమాలపై అధికారులు విచారణ ప్రారంభించారు. యూనియన్ బ్యాంకు వద్ద బాధితులు ఆందోళనకు దిగడంతో ఎస్సై హనుమంత నాగరాజు రంగప్రవేశం చేసి, బాధితులకు నచ్చచెప్పి, బ్యాంక్ అధికారులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. యానిమేటర్ సుధా ఆదిలక్ష్మి అనే మహిళకు సొమ్ము ట్రాన్స్ఫర్ చేసిన సంఘటనలకు సంబంధించి వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు.