పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న డీజిల్ కొరత నేటి నుంచి తీరింది. దీంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఆటో డ్రైవర్లకు రోజుకు 500 రూపాయల విలువైన డీజిల్ను మాత్రమే పరిమితం చేయడంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణాల వల్ల ఇప్పటికే తమ జీవనోపాధి దెబ్బతిన్నదని, ఇప్పుడు ఇంధన కొరతతో మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని డ్రైవర్లు తెలిపారు. ఇది తమ జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.