సచివాలయ మహిళా ఉద్యోగి ఆత్మహత్య

జీలుగుమిల్లిలో శనివారం పశువులకు వాడే మందు తాగి సచివాలయ మహిళా ఉద్యోగి అనుప్రియ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. మండలపర్రు సచివాలయ మహిళా వెటర్నరీ సహాయకురాలిగా పని చేస్తున్న అనుప్రియ భర్తతో మనస్పర్థల కారణంగా తండ్రి వద్ద ఉంటున్నారు. ఈ నెల 24న ఉదయం పశువుల మందు తాగినట్లు చెప్పడంతో ఆమె తండ్రి హెడ్ కానిస్టేబుల్ రాజేశ్ జంగారెడ్డిగూడెం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్