జీలుగుమిల్లిలో శుక్రవారం, సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించేందుకు SI క్రాంతి కుమార్, SI వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 'మీ రక్షణ మా బాధ్యత' పేరుతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, 112, 1930 హెల్ప్లైన్ నంబర్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఎలాంటి సమస్య వచ్చినా భయం లేకుండా పోలీసులను సంప్రదించాలని తెలిపారు.