పెంటపాడుకు చెందిన వివాహిత మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన మర్రి సాయి కుమార్, గుండుమోగుల నాగేంద్రబాబులను పెంటపాడు పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈనెల 5న మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. మహిళ ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, వారికి 14 రోజుల రిమాండ్ విధించారు.