ఉమ్మడి ప.గో జిల్లా న్యాయసేవాధికార సంస్థలో నూతనంగా మంజూరైన డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టులకు ఈనెల 7న జరగాల్సిన రాత పరీక్ష అనివార్య కారణాలతో మార్చబడిందని జిల్లా జడ్జి శ్రీదేవి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఫిబ్రవరి 12న మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు ఏలూరు సీఆర్రెడ్డి ఇంటర్మీడియట్ బ్లాక్ నందు పరీక్ష జరుగుతుందన్నారు. అభ్యర్థులు గమనించాలన్నారు.