తాడేపల్లిగూడెం పట్టణంలోని ఎఫ్సీఐ ఫీడర్, పీ & టీ కాలనీ ఫీడర్ పరిధిలో శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ నరసింహమూర్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు, పీఅండ్టీ కాలనీ పరిధిలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. కావున విద్యుత్తు వినియోగదారులు సహకరించాలని కోరారు.