తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలు కోట్లమ్మ ఆశీస్సులతో సుఖ సంతోషాలతో జీవించాలని వైసీపీ ఇన్చార్జ్ వడ్డీ రఘురాం నాయుడు ఆకాంక్షించారు. శుక్రవారం రాత్రి తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలను గ్రామ దేవత శ్రీ కోట్లమ్మ వారి జాతరలో పాల్గొని అమ్మ వారికి పూజలు జరిపించారు. అనంతరం ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఆయనను ఘనంగా సత్కరించారు.