క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం: ఎమ్మెల్యే రాధాకృష్ణ పిలుపు

తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ శనివారం అత్తిలి మండలం కొమ్మరలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని ప్రారంభించారు. శిరగాని నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు అత్తిలి మండలంలో శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని, మొదటి దశలోనే క్యాన్సర్ గుర్తించడం ద్వారా ప్రాణాపాయం నుంచి కాపాడేందుకు అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. క్యాన్సర్ మహమ్మారిని కలిసికట్టుగా తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్