అత్తిలి మార్కెట్ కమిటీ ఛైర్మన్గా జనసేన మండల అధ్యక్షుడు దాసం ప్రసాద్ను ప్రభుత్వ నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం గెజిట్ విడుదల చేసింది. వైస్ ఛైర్మన్గా కడలి రామాంజనేయులు, 13 మంది డైరెక్టర్లను కూడా నియమించారు. తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ తెలిపినట్లుగా, జనసేనకు ప్రాధాన్యతనిస్తూ ఈ నియామకాలు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు.