నూతన సంవత్సరంలో రాష్ట్రంలో మరింత అభివృద్ధి, సంక్షేమం అందించే దిశగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలకు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో సంకల్పించిన కార్యక్రమాలు సాధించేలా కుటుంబం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు.