తణుకులోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పవిత్రమైన తిరుపతి లడ్డు వ్యవహారంలో కూటమి ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేసి కోట్లాదిమంది భక్తుల మనోభావాలతో ఆడుకుందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు ఆ భగవంతుడే బుద్ధి చెబుతారని కారుమూరి అన్నారు.