పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలంలోని పెదపేటలో రామాలయాన్ని పునర్నిర్మిస్తామని ఏపీ శాసనసభ ఉపసభాపతి రఘురామ కృష్ణరాజు తెలిపారు. ప్రముఖ హిందూ సంస్థలు, శిల్పి ఈమని శివనాగిరెడ్డి ఆధ్వర్యంలో ఆగమ శాస్త్రం ప్రకారం, కృష్ణ శిలతో 800 ఏళ్లపాటు చెక్కుచెదరని విధంగా నిర్మాణం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో దేవాలయ చిత్రాన్ని పంచుకున్నారు.