పశ్చిమగోదావరి జిల్లా ఉండి ఆకివీడు పెద్దపేట రామాలయం నిర్మాణంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వైఖరిపై కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి క్రాంతి బాబు తీవ్రంగా మండిపడ్డారు. పెద్దపేటలో రామాలయాన్ని అర్థరాత్రి పూల్చివేయడం పిరికిపంద చర్య అని, ఇది కోర్టు ధిక్కరణ అని ఆయన అన్నారు. ఈ చర్యను కెవిపిఎస్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ చట్టాలను ఉల్లంఘిస్తున్న రఘురామ ఆ పదవికి అనర్హుడని పేర్కొన్నారు.