ఉండి మండల ప్రజలకు ఎస్ఐ హెచ్చరిక

సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందేలు, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఎస్సై నసీరుల్లా సూచించారు. శనివారం ఎన్. ఆర్. పి. అగ్రహారం, కోలమూరు గ్రామాల్లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ, యువతను ప్రోత్సహించేలా క్రీడా పోటీలు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించుకోవాలని కోరారు. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్