పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో బుధవారం తుఫాన్ నేపథ్యంలో కురుస్తున్న చిరుజల్లులు, బలమైన ఈదురు గాలుల వల్ల ఆక్వా రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణం చల్లగా ఉండటం వల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వారు వాపోతున్నారు. తుఫాను ప్రభావం మరికొన్ని రోజులు కొనసాగవచ్చని రైతులు అభిప్రాయపడుతున్నారు.