ఉండి మండలం చెరుకువాడ వద్ద శనివారం ఇసుక లోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పి పంట కాలవలోకి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.