ఏలూరు జిల్లా తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి ఉన్నమట్ల సునీత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గణపవరంలో శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. మహిళలను అవమానించిన వారు ఎవరూ బాగుపడలేదని, అంబటి రాంబాబు రోజులు దగ్గర పడ్డాయని అందుకే నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని సునీత ఆరోపించారు.