ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరగబోతోంది. పొత్తులో భాగంగా వీటిలో ఒక స్థానాన్ని జనసేనకు కేటాయించారు. దాంతో జనసేన తరఫున రాజ్యసభలో అడుగు పెట్టబోయేది ఎవరని చర్చ జరుగుతోంది. ఈ రేసులో నాగబాబు, లింగమనేని రమేశ్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరితో పాటు సీనియర్ నిర్మాత ఏఎం రత్నం పేరు కూడా వినిపిస్తోంది. అయితే పార్టీకి చాలా కాలంగా అండదండలు అందిస్తున్న లింగమనేని రమేశ్ వైపే పవన్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.