మాజీ సీఎం వైఎస్ జగన్ను ఉద్దేశించి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కీలక ప్రశ్నలు సంధించారు. "మహిళలు ఏం తప్పు చేశారని మీ నాయకులు మమ్మల్ని అవమానిస్తున్నారు? అవినీతి గురించి ప్రశ్నిస్తే అవహేళన చేయడమేంటి? మీ ఇంట్లో వారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకుంటారా? ఇలాంటి నేతలను ఎలా ప్రోత్సహిస్తున్నారు?" అంటూ జగన్ను నిలదీశారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.