పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పొలంలో వ్యర్థాలను తగలబెట్టే సమయంలో అనుకోకుండా మంటలు అంటుకోవడంతో వృద్ధురాలు పావులూరి పిచ్చమ్మ (70) సజీవదహనమయ్యారు. ఈ దుర్ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.