AP: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే పార్థసారథి తెలిపారు. ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు థాయిలాండ్లో జరిగిన ప్రపంచ మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడా పోటీల్లో ఆదోని పట్టణానికి చెందిన నీలం బండారి, హరిత కుమారి ప్రతిభ చాటి ఒక్కొక్కరూ మూసేసి పతకాలు సాధించారు. దాంతో ఎమ్మెల్యే క్రీడాకారుల ఇళ్లకు వెళ్లి అభినందించి, వారిని సన్మానించారు.