AP: విశాఖ బీచ్లలో మద్యం అమ్మకాల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ వైసీపీ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. టీడీపీ నాయకుల వేషధారణలో ఉన్నవారిని బీరులతో స్నానం చేయించి, ఆహ్లాదం, ఆనందం, ప్రశాంతత అందించే సాగర్ తీరాన్ని మత్తు ప్రాంతంగా మారుస్తారా? అని ప్రశ్నించారు. సంపద సృష్టి అంటే ఇదేనా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.