AP: సోషల్ మీడియాలో స్ట్రాంగ్ బేస్ కోసం వైసీపీ కొత్త వ్యూహాలు రూపొందిస్తుందా? అంటే అవుననే ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో వైసీపీ యాక్టివిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా వైసీపీ సోషల్ మీడియాను గట్టిగానే వాడుతూ వస్తోంది. అయితే ప్రజల్లో దీన్ని మరింతగా తీసుకెళ్లేలా వైసీపీ కొత్త ప్రణాళికలు సిద్ధం చేసింది. ‘జగనన్న టెక్ఫోర్స్’ పేరుతో వైసీపీ కొత్త కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. డిజిటల్ నిపుణుల సేవల్ని విస్తృతంగా వాడుకునేలా ప్రణాళికలు రచిస్తోంది.