AP: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి అధ్యక్షతన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రీజనల్ కో-ఆర్డినేటర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పీఏసీ మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర కార్యదర్శులు హాజరుకానున్నారు. సమకాలీన రాజకీయ అంశాలు, ప్రజాసమస్యలపై పార్టీ నేతలతో వైఎస్ జగన్ చర్చించనున్నారని పార్టీ తెలిపింది.