AP: రాష్ట్రంలో అరాచకాలకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. కన్ను కొడితే చీకట్లో మనిషిని లేపేసి.. తెల్లవారి మళ్లీ మనమే పరామర్శకు వెళ్లాలి అన్నట్లు వైసీపీ తీరు ఉందని మంత్రి విమర్శించారు. నిన్న గుడివాడలో జరిగిన ఘర్షణ మొత్తం పక్కా ప్రణాళికతో జరిగిందే అని మంత్రి కొల్లు ఆరోపించారు. వైఎస్ జగన్ లాంటి క్రూరుడు రాష్ట్ర రాజకీయాల్లో ఉండడం మన దౌర్భాగ్యం అన్నారు.