AP: అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. 6 ఏళ్ళ తర్వాత తప్పని పరిస్థితుల్లో విచారణ నిమిత్తం కోర్టుకు వెళ్తూ, కార్యకర్తలతో బల ప్రదర్శనకు దిగడం జగన్ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. తాను కోర్టుకు హాజరైతే సమస్యలు ఎదురవుతాయని న్యాయస్థానాన్ని నమ్మించే ప్రయత్నంలోనే హైదరాబాద్లో నానా హంగామా సృష్టించారని మంత్రి సత్యకుమార్ ధ్వజమెత్తారు.