సందడిగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

జమ్మలమడుగులో సోమవారం మునిరెడ్డి కాంప్లెక్స్ ఆవరణలో త్రైత సిద్ధాంతం వారి ఆధ్వర్యంలో.. కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జమ్మలమడుగు మున్సిపల్ చైర్ పర్సన్ వేల్పుల శివమ్మ దంపతులు పాల్గొని శ్రీకృష్ణునికి విశిష్ట పూజలు నిర్వహించారు. అనంతరం పురోహితులు కళ్యాణ శర్మ మీడియాతో మాట్లాడుతూ శ్రీ కృష్ణాష్టమి విశిష్టతను, శ్రీకృష్ణ తత్వాన్ని వివరించారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినం సందర్బంగా శ్రీకృష్ణుని భక్తితో, నిండు మనసుతో పూజిస్తే విశేష ఫలితాలు ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్