పులివెందులలోని భాకరాపురం వైసీపీ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం వైసీపీ ప్రజా ఉద్యమము పోస్టర్ ను మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్, వైస్ ఛైర్మన్ మనోహర్రెడ్డి ఆవిష్కరించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా ఈనెల 28న పులివెందుల నియోజకవర్గ స్థాయిలో ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ పార్టీనేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.