AP: వైఎస్సార్ విగ్రహాన్ని వైసీపీ ధ్వంసం చేసి టీడీపీపై నెట్టాలని చూస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. సోమవారం అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో శాంతిభద్రతలకు భగం కలిగించేందుకు వైసీపీ కుట్రలు చేస్తోంది. దుష్ప్రచారాలు చేయడమే వైసీపీ పనిగా పెట్టుకుంది’ అని విమర్శించారు.