వైసీపీ నాయకురాలికి 14 రోజులు రిమాండ్‌

AP: వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణికి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు మార్ఫింగ్‌ ఫొటోలను పోస్ట్‌ చేయడంపై గతంలో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. పీటీ వారెంట్‌పై మంగళవారం ఆమెను కోర్టుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న కృష్ణవేణికి నరసరావుపేట కోర్టు 14 రోజులు రిమాండ్‌ విధించింది.

సంబంధిత పోస్ట్