AP: నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ను అరెస్ట్ చేసి విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి రెడ్ బుక్ ఉంటే.. తమకు డిజిటల్ బుక్ ఉందని వైసీపీ నేతలు అన్నారు. పోలీస్ స్టేషన్కు టీడీపీ జెండా ఏమైనా కట్టారా? అంటూ ఫైరయ్యారు.