AP: వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని వైసీపీ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘‘రాష్ట్ర రాజకీయాల్లో విలువలు, వ్యక్తిత్వం, విశ్వసనీయత ఉన్న నాయకుడు ఎవరన్నదీ ప్రజలందరికీ తెలుసు. ఆడిటర్గా ఉన్న వ్యక్తి అన్ని హోదాలు, అన్ని పదవులు అనుభవించాడు. వైయస్ కుటుంబం పరువును బజారుకు ఈడుస్తున్నది ఎవరో, ఇది ఎవరి కనుసన్నల్లో జరుగుతోందో ప్రజలందరికీ తెలుసు’’ అని ఆయన ట్వీట్ చేశారు.