AP: కృష్ణలంక సాయికృష్ణ హత్య కేసులో మెజిస్టీరియల్ విచారణ వల్ల వాస్తవాలు బయటకు రావని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. ‘ఈ కేసులో జ్యుడీషియల్ లేదా సీబీఐ విచారణ జరగాలి. ఇందులో పెద్దవాళ్ల హస్తం ఉందని అనుమానం ఉంది. సీఐ నాగరాజును బాధ్యుడిని చేసి కేసు ముగించాలని చూస్తున్నారు. నిందితులకు శిక్ష పడేవరకు వైసీపీ పోరాడుతుంది’ అని అన్నారు.