20 ఏళ్ల నుంచి పండ్లు మాత్రమే తింటూ కొనసాగిస్తున్న దీక్ష

ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీకి చెందిన రంజీత్‌ సింగ్‌, సైన్యంలో హవల్దార్‌గా పనిచేసి 2005లో పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి అంటే గత రెండు దశాబ్దాలుగా ఆయన అన్నం, గోధుమలు వంటి ధాన్యాలతో చేసిన వంటకాలకు దూరంగా ఉంటూ, కేవలం పండ్లు, డ్రై ఫ్రూట్స్‌ మాత్రమే తింటున్నారు. సాధువుల జీవనశైలిని చూసి, క్రమశిక్షణతో ఉంటే ఆరోగ్య సమస్యలు రావని తెలుసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సింగ్‌ తెలిపారు. ప్రస్తుతం ఆయన ప్రయాగ్‌రాజ్‌లో నివసిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్