ఫెడరల్యాంటీ మనీ లాండరింగ్ ఏజెన్సీలో 11 మంది ఈడీ క్యాడర్ అధికారులను జాయింట్ డైరెక్టర్ ర్యాంకుకు కేంద్రం పదోన్నతని కల్పించింది. ఈ విధంగా ఇంత ఎక్కువ సంఖ్యలో అధికారులు జేడీ స్థాయికి పదోన్నతిని పొందటం ఇదే మొదటిసారనీ, జేడీ స్థాయి అనేది దర్యాప్తులో ఒక ముఖ్యమైన స్థానమని అధికారిక వర్గాలు చెప్పాయి. జేడీలుగా క్యాడర్ అధికారులను గతంలో రెండు, మూడు స్థానాలకు మాత్రం నియమించేవారని వివరించాయి.