కువైట్లోని అహ్మది గవర్నేట్లో ఇటీవల ఓ బిల్డింగ్లో జరిగిన అగ్నిప్రమాదంలో 50 మంది మృతిచెందగా, దాంట్లో 46 మంది భారతీయులే ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ బాధిత కుటుంబాలకు కువైట్ సర్కారు నష్టపరిహారాన్ని ఇవ్వనున్నది. ప్రతి ఒక్క బాధిత కుటుంబానికి సుమారు 12.5 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మన్గాఫ్ సిటీలోని ఏడు అంతస్థుల భవనంలో జూన్ 12న అగ్నిప్రమాదం సంభవించింది.