ఢిల్లీలోని తీహార్ జైలులో 125 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్గా తేలింది. తీహార్ జైలులో వందలాది మంది ఖైదీలకు హెచ్ఐవీ సోకినట్లు, 200 మంది ఖైదీలు సిఫిలిస్ లక్షణాలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. తీహార్ జైలులో తీహార్, రోహిణి, మండోలి అనే మూడు జైళ్లు ఉన్నాయి. ఈ జైళ్లలో 125 మంది ఖైదీలకు హెచ్ఐవీ సోకినట్లు గుర్తించారు. తీహార్ జైలులో దాదాపు 14,000 మంది ఖైదీలు ఉండగా, వారిలో 10,500 మంది ఖైదీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు.