డీజే సౌండ్ కు 140 కోళ్లు మృతి.. నిర్వహకుడి పై కేసు

ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ జిల్లాలో పెళ్లి ఊరేగింపులో భారీ డీజే సౌండ్ ఎఫెక్ట్స్ కారణంగా 140 కోళ్లు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. డీజే శబ్దానికి భయపడి కోళ్లు చనిపోయాయని కోళ్ల ఫారం యజమాని ఆరోపించారు. ఈ ఘటనపై డీజే ఆపరేటర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్