తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి గురువారం 15 గంటల సమయం పడుతోంది. 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. బుధవారం స్వామివారిని 75,303 మంది భక్తులు దర్శించుకోగా 27,166 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 3.99 కోట్లు హుండీ ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.