ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. ఈ మ్యాచ్ సందర్భంగా 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, ఐసీసీ బాస్ జై షా పక్కపక్కన కూర్చోవడం హాట్ టాపిక్ అయింది. మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్కు హాజరైన వైభవ్, జై షా పక్కన కూర్చుని సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలో ఇద్దరూ ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు. ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో వైభవ్ సూర్యవంశీకి టీమిండియాలో చోటు దక్కబోతోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.